ఎమ్మెల్యే పద్మావతి భర్తకు కీలక పదవి

ఎమ్మెల్యే పద్మావతి భర్తకు కీలక పదవి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ / CEO గా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని ఏపీ...

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ / CEO గా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్బంగా తనకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఆలూరు సాంబశివారెడ్డి. ఈ సందర్బంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచిన ఈ అతి పెద్ద బాధ్యతలను‌ చిత్తశుద్ధితో నెరవేరుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ విద్యా యజ్ఞంలో మీ అందరి సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories