రాజధాని రైతులకు ఏపీ సర్కార్ వరాలు

రాజధాని రైతులకు ఏపీ సర్కార్ వరాలు
x
రాజధాని రైతులకు ఏపీ సర్కార్ వరాలు
Highlights

మూడు రాజధానుల ప్రతిపాదనలతో ఓవైపు అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా రైతులపై వరాలు కురిపించింది వైసీపీ సర్కార్. రాజధాని రైతులకు ప్రభుత్వం...

మూడు రాజధానుల ప్రతిపాదనలతో ఓవైపు అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా రైతులపై వరాలు కురిపించింది వైసీపీ సర్కార్. రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచబోతున్నామని వెల్లడించిన ఆయన. రాజధానికి భూములు ఇచ్చిన పట్టారైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన అసైన్డ్‌ దారులకు రిటర్న్‌ ప్లాట్ల కేటాయిస్తామని తెలిపారు. ఇక, భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ.50 వేలు, మెట్టభూమికి అయితే రూ.30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలన్నది నిర్ణయం.

అలాగే ప్రతి ఏటా జరీబుకు రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని, ఈ యాన్యునిటీని 10 సంవత్సరాలనుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయించామని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.1 లక్ష రూపాయిలు, మెట్ట భూమికి రూ.60 వేలు అవుతుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories