రెండు నెలలకు కలిపి పెన్షన్ .. సీఎం జగన్ కీలక నిర్ణయం

రెండు నెలలకు కలిపి పెన్షన్ .. సీఎం జగన్ కీలక నిర్ణయం
x
Highlights

పెన్షన్‌ తొలిగించారని ప్రతిపక్షాలు భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్‌ తొలిగించారని ప్రతిపక్షాలు భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెరిఫికేషన్‌ చేసిన తర్వాత అర్హత ఉందని తేలితే వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల్లో పెన్షన్‌కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ, పెన్షన్‌ అందలేదని పెద్ద ఎత్తున వస్తున్న వార్తలను వస్తున్నాయిని, పెన్షన్‌ అర్జీలను ఫిబ్రవరి 17 నాటికి రీ వెరిఫికేషన్‌ చేయాలని చెప్పారు.

ఫిబ్రవరి18కల్లా అప్‌లోడ్‌ చేసి, ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ చేయాలని అధికారులకు ఆదేశించారు. మార్చి 1న పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. కార్డుతో కూడా అదే రోజు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష చూపకూడదని తేల్చి చెప్పారు. కొత్తగా పెన్షన్లు 6,14,244 ఇచ్చామని, అయినా పెన్షన్లు తీసేసినట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.

అలాగే కంటి వెలుగు పథకం సంబంధిచి శస్త్రచికిత్సలను వేసవి సెలవుల నాటికి వాయిదా వేసినట్లు సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. శస్త్రచికిత్స చేయించిన చిన్నారులకు 25 రోజుల విశ్రాంతి ఉండడంతో పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు వాయిదా వేశామని అధికారులు తెలిపారు. దీంతో 'అవ్వా- తాత' కంటి వెలుగు మూడో విడత ఫిబ్రవరి18న కర్నూలులో ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 24న జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. వసతి దీవెన కార్యక్రమాన్ని ఉన్నతచదువులు చదివిన వారికి అండగా.. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యార్థికి సంవత్సరానికి రెండు దఫాల్లో రూ.20 వేలు ఇవ్వేనున్నట్లు తెలిపారు. జగనన్న వసతి దీవెన పథకం వల్ల 11,87,904 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories