'సీపెట్‌' ప్రారంభించిన సీఎం, కేంద్రమంత్రి

సీపెట్‌ ప్రారంభించిన సీఎం, కేంద్రమంత్రి
x
Highlights

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని (సీపెట్‌) గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని (సీపెట్‌) గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ సంయుక్తంగా ప్రారంభించారు. ఉదయం 11.00 గంటలకు సదానందగౌడతో కలసి సీపెట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు జగన్. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి వీక్షించారు. సూరంపల్లిలో 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో సీపెట్‌ భవనాలను నిర్మించారు. ఇందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చించాయి. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మాట్లాడారు.. ఈ సందర్బంగా నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు ముఖ్యమంత్రి. స్థానికత కింద రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు చట్టాన్ని చేసినట్టు గుర్తుచేశారు.

భవిశ్యత్ లో ప్రతి పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రోగ్రాంకు కేంద్రం సాయం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి సదానంద గౌడ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కు ప్రధాని మోదీ సాయం అందిస్తున్నారని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు సదానంద గౌడ. కాగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే పార్థసారధి, గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, సీపెట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్, కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories