నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తాడేపల్లి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తాడేపల్లి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎంకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు వెల్‌కమ్‌ ప్లకార్టులతో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యాయి. తొలుత హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అనంతరం అక్కడినుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories