సీఎం జగన్ మూడు రోజుల పర్యటన వివరాలు ఇవే..

సీఎం జగన్ మూడు రోజుల పర్యటన వివరాలు ఇవే..
x
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వెళ్లారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వెళ్లారు. అక్కడే క్రిస్మస్ పండగ జరుపుకొంటారు. సీఎం మూడు పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

1.35 గంటలకు దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చేరుకుంటారు.

♦ 1.45 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.

♦ 3.40 గంటలకు కడప రిమ్స్‌కు వెళతారు.

♦ 3.55 నుంచి 4.05 గంటల వరకు కడపలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.

♦ 4.15 గంటలకు వైఎస్సార్‌ ఉచిత భోజన, వసతి భవనం వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.25 గంటలకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

♦ 4.45 గంటలకు కడప–రాయచోటి మార్గంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. 4.50 నుంచి 5.00 గంటల వరకు అక్కడి రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

♦ సాయంత్రం 5.55 గంటలకు పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.

24వ తేది కార్యక్రమాలు

♦ ఉదయం 9.10 నుంచి 9.40 గంటల వరకు దివంగత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.

♦ 9.55 గంటలకు అక్కడున్న చర్చి వద్దకు వెళతారు.

♦ 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అక్కడ ప్రార్ధనలు నిర్వహిస్తారు.

♦ 1.40 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.00 గంటలకు రాయచోటి జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ వద్దకు చేరుకుంటారు.

♦ మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

♦ 5.10 గంటలకు తిరిగి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.

25వ తేది కార్యక్రమాలు

♦ ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌లో దిగుతారు.

♦ 9.45 గంటలకు సీఎస్‌ఐ చర్చికి చేరుకుంటారు. 9.50 నుంచి 11.10 గంటల వరకు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు.

♦ 11.25 నుంచి 12.10 గంటల వరకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు.

♦ 12.30 గంటలకు భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు.

♦ 2.35 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 3.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.10 గంటలకు ఎయిర్‌పోర్టులో విమానంలో బయలుదేరి 4.00 గంటలకు గన్నవరం వెళతారు. 4.30 గంటలకు తాడేపల్లిలో తన నివాసానికి చేరుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories