ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం
x
Highlights

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపి వేస్తూ జీవో...

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపి వేస్తూ జీవో జారీ చేస్తామన్నారు. బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పుడు అక్కడ మైనింగ్‌ నిర్వహించడంలో అర్థం లేదన్నారు. బాక్సైట్ మైనింగ్ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం లేదని, మనకు శాంతి, ప్రశాంతత ముఖ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. యువకులు మావోయిస్టులుగా మారకుండా గిరిజన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, గిరిజనుల జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం జగన్ ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories