గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ..

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ..
x
Andhra Pradesh Governor Biswabhusan Harichandan
Highlights

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు...

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు జగన్. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం జగన్‌ శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్‌, సీఎం జగన్‌లు సామాజిక దూరం పాటించారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 23 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories