'క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌" కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

* జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించిన సీఎం జగన్ * 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు

Sandeep Reddy
Updated on: 2 Oct 2021 1:54 PM IST
AP CM Jagan Lauches Clean Andhra Pradesh - Jagananna Swachh Sankalpam in Vijayawada Today 02 10 2021
X

జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (ట్విట్టర్ ఫోటో)

YS Jagan: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన 'క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం​. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story