కర్నూలులో భూములు సిద్ధం చేయండి.. జీఎన్ రావు కమిటీ సంచలనం

కర్నూలులో భూములు సిద్ధం చేయండి.. జీఎన్ రావు కమిటీ సంచలనం
x
Highlights

ఏపీ రాజధాని వ్యవహారాన్ని తేల్చేందుకు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించి జిఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ...

ఏపీ రాజధాని వ్యవహారాన్ని తేల్చేందుకు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించి జిఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తోంది. అయితే ఇటీవల కర్నూలు జిల్లాకు వచ్చిన కమిటీ.. అధికారులకు చేసిన సూచనలు ఆసక్తికరంగా మారాయి. ఓర్వకల్ విమానాశ్రయంలో భూమిని సిద్ధం చేయాలని కమిటీ అధికారులకు సూచించింది. జిఎన్ రావు కమిటీ విమానాశ్రయానికి సమీపంలో భూమిని ఎందుకు సిద్ధం చేస్తుందో అని జిల్లా ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కమిటీ సూచనలపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కమిటీ హైకోర్టును ఏర్పాటు చేయడం కోసం భూమిని సిద్ధం చెయ్యాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఈ కమిటీతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యాన్, ఎస్పీ ఫకీరప్ప సమావేశమయ్యారు. రహదారి, రైల్వేల ఆధునీకరణకు వివరాలు ఇచ్చారు కలెక్టర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories