చంద్రబాబు పర్యటనకు నిరసనగా భారీగా ఫ్లెక్సీలు

చంద్రబాబు పర్యటనకు నిరసనగా భారీగా ఫ్లెక్సీలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే చంద్రబాబు అమరావతికి రావొద్దంటూ కొందరు రైతులు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకించిన రాజధాని రైతులు, నిర్మాణ కార్మికుల పేరిట ఈ ఫ్లెక్సీలను నిర్మించారు. కృష్ణానది నుండి రాయపుడి వరకు ప్లెక్సీలు ఏర్పాటు చేసిన రైతులు చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. రాజధాని పేరిట రైతులను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ అమరావతికి ఎలా వచ్చారని రాశారు.

"రాజధాని పేరిట రంగురంగుల గ్రాఫిక్స్ చూపించి మీరు మాకు ఎందుకు ద్రోహం చేసారు?" అంటూ పేర్కొన్నారు. అమరావతికి వచ్చేముందు బాబు క్షమాపణలు చెప్పాలని వారు హెచ్చరించారు. "గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 28,054 మంది రైతుల నుండి భూసేకరణ ద్వారా వేలాది ఎకరాలు సేకరించారు" అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories