AP Budget 2025-26: రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

AP Budget 2025-26: Finance Minister Payyavula Keshav Presents Budget 2025-26
x

రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పెట్టింది. రెవిన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 40,635 కోట్లు, రెవిన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు.

బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయించిన నిధులు

ఎస్సీ సంక్షేమం రూ.20,281 కోట్లు

బీసీ సంక్షేమం రూ.47,456 కోట్లు

వైద్య, ఆరోగ్య శాఖ రూ.19, 264 కోట్లు

పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు

ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు

పంచాయితీరాజ్ శాఖకు రూ. 18,847 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 13, 862 కోట్లు

నీటి పారుదల శాఖకు రూ. 18,019 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 3,156 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ. 3,806 కోట్లు

తెలుగు భాష ప్రచారం, అభివృద్దికి రూ., 10 కోట్లు

తల్లికి వందనం రూ. 9,407 కోట్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.27,518 కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రూ.3,486 కోట్లు

ఆదరణ పథకం రూ.1000 కోట్లు

దీపం పథకం రూ.2,601 కోట్లు

అమరావతి నిర్మాణానికి రూ. 6,000 కోట్లు

వ్యవసాయ బడ్జెట్ రూ. 48 వేల కోట్లు

పోలవరం నిర్మాణం రూ. 6,705 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories