విశాఖలో మరో ఆలయంపై దుండగుల దాడి

విశాఖలో మరో ఆలయంపై దుండగుల దాడి
x
Highlights

* ఏటి గైరంపేటలోని ఓ ఆలయంలో వినాయకుడి విగ్రహ‍ం ధ్వంసం * చేతులను విరగ్గొట్టి కిందపడేసిన దుండగులు * ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటన మరువకముందే విశాఖలో మరో ఘటన వెలుగుచూసింది. గోలుగొండ మండలం ఏటి గైరంపేటలో రాములవారి ఆలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. వినాయకుడి చేతులను విరగ్గొట్టి కిందపడేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories