AP: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.6 వేల జమ ఎప్పుడంటే?

AP: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.6 వేల జమ ఎప్పుడంటే?
x
Highlights

AP: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.6 వేల జమ ఎప్పుడంటే?

Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చే ప్రకటన చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకం కింద రైతులకు రెండు విడతల్లో రూ.14 వేల చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేశామని, త్వరలో మరో విడత సాయం అందించనున్నట్లు తెలిపారు.

రైతులకు ఎంతో కీలకమైన ప్రకటనగా, ఫిబ్రవరి నెలలో రూ.6 వేల మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సాయం ద్వారా సాగు ఖర్చులు, కుటుంబ అవసరాలకు కొంతమేర భరోసా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పంటల సాగులో నష్టపోయిన రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, నిన్న కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు, ఉల్లి సాగులో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేశారు. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన 37,752 మంది రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.128.33 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ధరల పతనంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా రైతుల సంక్షేమమే కేంద్రబిందువుగా విధానాలు కొనసాగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆశలు చిగురించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories