జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడు

జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడు
x
జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడు
Highlights

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సీఎం జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడని విమర్శించారు. చంద్రబాబు దమ్ముంటే టీడీపీని వదలి మరో పార్టీ పెట్టి వైసీపీపై పోటీ చేయాలని సవాల్ చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై అభిమానంతో టీడీపీకి ఓట్లు వేస్తున్నారని, చంద్రబాబును చూసి కాదని పేర్కొన్నారు. చంద్రబాబు వెనుక ఉంది ఎన్టీఆర్ అభిమానులని అన్నారు.

వైసీపీని గాలిలో కలుపుతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు. రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు సాధించి చరిత్ర సృష్టించిన పార్టీని వైసీపీ ఒక్కటే అని మంత్రి అన్నారు. సీఎం జగన్‌ 10 ఏళ్లు తన కష్టంతో.. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నికల్లో సంచలన విజయం సాధించారని గుర్తు చేశారు. సీఎం జగన్‌లో ఉన్న క్షమా, దయా గుణం వల్లే తెలుగుదేశం వారు ఎన్ని కుట్రలు చేస్తున్నా సహిస్తున్నారని మంత్రి అనిల్‌ వ్యాఖ్యానించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా సహించరని చెప్పారు. లోక్ సభలో తమ ఎంపీ మిథున్‌ రెడ్డి ఎన్నార్సీకి వ్యతిరేకిస్తూ మాట్లాడారని.. టీడీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. టీడీపీకి ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏపై మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ముస్లింలకు అన్యాయం జరిగితుంటే సీఎం మౌనంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చిచేప్పారు. రాష్ట్రంలోకి ఎన్నాఆర్సీని రానిచ్చే ప్రసక్తే లేదని జగన్ చెప్పారని మంత్రి గుర్తుచేశారు. నెల్లూరు రాజకీయాల్లో ముస్లింల వల్లే ప్రతిసారీ గెలవగలిగానని అనిల్ కుమార్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories