Andhra: భర్తను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన భార్య – నంద్యాలలో సంచలనం

సాధారణంగా సున్నితమైన స్వభావం, శాంతమైన మనస్తత్వం కలిగినవారిగా భావించే మహిళలు, ఇప్పుడు భర్తలనే హతమార్చే దారుణాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఒక భయానక ఘటన దీనికి నిదర్శనం.

Ramya Vegirouthu
Published on: 23 July 2025 6:42 PM IST
Andhra: భర్తను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన భార్య – నంద్యాలలో సంచలనం
X

Andhra: భర్తను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన భార్య – నంద్యాలలో సంచలనం

సాధారణంగా సున్నితమైన స్వభావం, శాంతమైన మనస్తత్వం కలిగినవారిగా భావించే మహిళలు, ఇప్పుడు భర్తలనే హతమార్చే దారుణాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఒక భయానక ఘటన దీనికి నిదర్శనం.

ఏం జరిగింది?

నూనెపల్లికి చెందిన రమణ అనే వ్యక్తి, పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు కొనసాగుతుండటంతో రమణమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి వస్తుందేమో అని కొంతకాలం ఎదురుచూసిన రమణ, ఆ తర్వాత ఆమెను నచ్చజెప్పేందుకు పిడుగురాళ్లకు వెళ్లాడు.

అయితే అక్కడ పరిస్థితి విషమించింది. అల్లుడిని గౌరవించకపోగా, రమణమ్మ కుటుంబసభ్యులు అతనితో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో రమణమ్మ, ఆమె సోదరుడు కలిసి రమణ కళ్లలో కారం చల్లి దాడి చేశారు. తీవ్ర గాయాలతో రమణ అక్కడికక్కడే మృతిచెందాడు.

హత్య అనంతరం, రమణమ్మ మరియు ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చి అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story