నేతలకు ఫోన్లు చేసి భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నేతలకు ఫోన్లు చేసి భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
x
Vijaysai Reddy, Chandrababu Naidu (file Photo)
Highlights

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సస్పెండ్ గురైన డాక్టర్ సుధాకర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. "చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుందని" అని అన్నారు.

మరో ట్వీట్ " పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం పట్టుకుంది బాబుకు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట. రాజధానిలో పేదలకు పట్టాలివ్వకుండా కోర్టు స్టే ఇవ్వడం ఉత్సాహం నింపిందని అంటున్నారని విమర్శించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories