ఎన్టీఆర్ ట్రస్టులోకి వంద కోట్ల లాగారు.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ట్రస్టులోకి వంద కోట్ల లాగారు.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
x
Chandrababu Naidu(File Photo)
Highlights

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరో సారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరో సారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో హుదూద్‌ను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు,.. పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఎన్టీఆర్ ట్రస్టులోకి లాగారన్నారు. తుఫాను బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబు ఈ మొత్తం సొమ్ము నొక్కేశారని.. ఎన్టీఆర్‌ ట్రస్టు పేరిట తండ్రీ కొడుకుల అసాంఘిక కార్యకలాపాల మీద పూర్తి స్థాయి విచారణ కోరుతున్నా అంటూ.. ట్విట్టర్‌ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. త్యాగాలు మీవి...భోగాలు వారివి! నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులూ, కార్యకర్తలూ నిలదీయండి. మీరిచ్చిన విరాళాలు ఎటు పోయాయని అడగండి ..ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు... ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్‌గారూ... మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండి! అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories