700 తాబేళ్లు అక్రమ రవాణా.. కృష్ణా జిల్లాలో ఇద్దరు అరెస్టు

700 తాబేళ్లు అక్రమ రవాణా.. కృష్ణా జిల్లాలో ఇద్దరు అరెస్టు
x
Highlights

700 తాబేళ్లు అక్రమ రవాణా.. కృష్ణా జిల్లాలో ఇద్దరు అరెస్టు 700 తాబేళ్లు అక్రమ రవాణా.. కృష్ణా జిల్లాలో ఇద్దరు అరెస్టు

కృష్ణా జిల్లాలోని కొరుకొల్లు గ్రామంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. వారివద్దనుంచి 700 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ మాట్లాడుతూ.. ఒడిశా నుండి తాబేలు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను తమ బృందం పట్టుకున్నట్లు చెప్పారు. "ఒడిశాకు దాదాపు 700 తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఆటోలను పోలీసులు కనుగొన్నారు.

నిందితులు ఎన్ అంజనేయులు, పి నాగభూషణం గా గుర్తించారు, వీరు సమీప గ్రామాల నుండి తాబేళ్లను సేకరించి ఒడిశాకు పంపించేవారు" అని ఎస్సై రామకృష్ణ చెప్పారు. పోలీసులు తాబేళ్లను స్వాధీనం చేసుకొని అటవీ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులకు అందజేశారు. నిందితులపై జంతు క్రూరత్వం చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని కైకలూరు మేజిస్ట్రేట్ ముందు పరిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories