Botsa Satyanarayana about Tenant Farmers: రైతులకు కౌలు చెల్లించాము: మంత్రి బొత్స

Botsa Satyanarayana about Tenant Farmers: రైతులకు కౌలు చెల్లించాము: మంత్రి బొత్స
x

Botsa Satyanarayana 

Highlights

Minister Botsa Satyanarayana about Tenant Farmers: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది.

Minister Botsa Satyanarayana about Tenant Farmers: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది. వారికి వార్షిక లీజు మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండు నెలల పెన్షన్‌లో రూ.158 కోట్లులలో, రూ .9.73 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బును త్వరలో రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు.

రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు అమరావతి రైతులు, మహిళలు బుధవారం సిఆర్‌డిఎ కార్యాలయంలో ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించారు. తమకు చెల్లించని లీజు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందించి రైతులకి నిన్ననే కౌలు చెల్లించామని.. అయితే, సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు ఆలస్యం అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే డబ్బు చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.

భూహక్కు పాత్రలను అమ్ముకున్న రైతులకు కౌలు చెల్లించబోమని మంత్రి తెలిపారు. అమరావతి రైతుల పెన్షన్ ను రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించామని.. అయితే, ప్రతిపక్షాలు కేసులు వేయడం వల్ల అది సాధ్యపడలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రీతులను రెచ్చగొడుతున్నారని అయన ఆరోపించారు. అంతే కాదు సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని బొత్స తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories