ఏపీలో స్థానిక పోరు: భారీగా ఎంపీటీసీల ఏకగ్రీవాలు.. అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే

ఏపీలో స్థానిక పోరు: భారీగా ఎంపీటీసీల ఏకగ్రీవాలు.. అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే
x
YSRCP
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగిస్తోంది. చాలా చోట్ల ఏకగ్రీవాలను కైవసం చేసుకుంది. కేవలం వైసీపీకి చెందిన నామినేషన్లే కొన్నిచోట్ల వచ్చాయి. దాంతో భారీగా ఏకగ్రీవాలు జరిగాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగిస్తోంది. చాలా చోట్ల ఏకగ్రీవాలను కైవసం చేసుకుంది. కేవలం వైసీపీకి చెందిన నామినేషన్లే కొన్నిచోట్ల వచ్చాయి. దాంతో భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ ఏకగ్రీవాలను దక్కించుకుంది వైసీపీ. మాచర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీకి ఏకగ్రీవంగా 60 దక్కాయి.

ఈ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాల్లో ఒకే పార్టీకి చెందిన నామినేషన్లు వచ్చాయి. అలాగే రెంటచింతల మండలంలో 13 , దుర్గి లో 12 , మాచర్లలో 9 , కారంపూడిలో 9 ఎంపీటీసీల ఏకగ్రీవాలు అయ్యాయి. ఇక నరసరావుపేట నియోజకవర్గంలో 6 చోట్ల ఒకటే నామినేషన్ దాఖలైంది. దాంతో ఇక్కడ కూడా ఆరు ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, దర్శి , కనిగిరి నియోజకవర్గాల్లో భారీగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే.. శ్రీకాకుళంలో 2 చోట్ల వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు సొంత ఇలాకాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజాం నియోజకవర్గం రేగిడి ఆమోదాలవలసలో 3 , సంతకవిటి మండలంలో 2 ఎంపీటీసీ లు ఏకగ్రీవం అయ్యాయి. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలంలో 3 ఎంపీటీసీలు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1 ఎంపీటీసీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఒకటే నామినేషన్ వచ్చినట్టు ఈసీ తెలియజేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories