Andhra Pradesh: రాజభవన్‌లో ఎట్‌హోం.. హాజరుకాని చంద్రబాబు

Andhra Pradesh: రాజభవన్‌లో ఎట్‌హోం.. హాజరుకాని చంద్రబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గైర్హాజరైయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గైర్హాజరైయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పికర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రులు, టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు హాజరైయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ పార్టీ నేతలు ఎవరు హాజరుకాలేదు. అంతకుముందు చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఆదివారం టీడీపీఎల్పీ భేటీ జరిగింది. సోమవారం అసెంబ్లీ సమావేశానికి దూరంగా వుండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. మండలిలో జరిగిన చర్చను అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశానికి వెల్లకుడదని టీడీఎల్పీ నిర్ణయించింది. ఐదుగురు ఎమ్మెల్సీలు మినహా 24 మంది సమావేశానికి వచ్చారు. టీడీఎల్పీ సమావేశానికి రాలేమని ముందుగానే సమాచారం ఇచ్చారు ఐదుగురు ఎమ్మెల్సీలు. వీరిలో గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories