ఏపీలో కుటుంబానికి రూ.1000 ఇచ్చేది ఎప్పుడంటే

ఏపీలో కుటుంబానికి రూ.1000 ఇచ్చేది ఎప్పుడంటే
x
YSJagan
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు విలవిలలాడిపోతుంటే, మరోవైపు లాక్‌డౌన్‌తో ఎక్కడి కి వెళ్లలేని పరిస్థితి దీంతో పేదలకు ఉపాధి ఆగిపోయింది .

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు విలవిలలాడిపోతుంటే, మరోవైపు లాక్‌డౌన్‌ తో ఎక్కడి కి వెళ్లలేని పరిస్థితి దీంతో పేదలకు ఉపాధి ఆగిపోయింది .రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు అంతా ఇంతా కాదు. ఈ నేథ్యంలోనే పేదల కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000 అందించనున్నారు. ఈ డబ్బును అర్హులకు ఈనెల నాలుగో తేదీ శనివారం నుంచి అందజేయనున్నారు. గ్రామ వాలంటీర్లు ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. పింఛన్ పంపిణీకి అనుసరించిన విధానాన్నేరూ.1000 అందించే సమయంలోనూ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి డబ్బు అందజేసి కుటుంబ పెద్దతో ఫోటోను తీసుకోనున్నారు. ఇక ఆ ఫోటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.

డబ్బును పంపిణీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. ఈ డబ్బును గ్రామ వార్డు సచివాలయ ఖాతాలల్లో డిపాజిట్ చేశారు. జగన్ సర్కారు రూ. 1000 పేదలు నిత్యావసరాల వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా అందజేస్తుంది. ఇప్పటికే పేదలకు ముందుగానే రేషన్ పంపిణీ చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందజేసింది. కెసిఆర్ సర్కార్ మాత్రం రూ.1500 అందజేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories