YS Jagan: ఏపీ సీఎం కీలక నిర్ణయం.. గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్..

YS Jagan: ఏపీ సీఎం కీలక నిర్ణయం.. గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్..
x
YSJagan(File photo)
Highlights

కరోనా కట్టడి, ప్రజారోగ్యం దృష్టిలో వుంచుకొని ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా కట్టడి, ప్రజారోగ్యం దృష్టిలో వుంచుకొని ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ లు వ్యాప్తి చెందుతుండటంతో గ్రామ, వార్డు క్లినిక్స్ కీలకంగా మారతాయన్నారు. వార్డు క్లినిక్స్‌ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు.

ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, పాఠశాలల్లో నాడు–నేడు , గ్రామ సచివాలయాల నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని సీఎం అన్నారు.వాస్తవానికి విలేజ్ క్లినిక్స్ ప్రారంభించాలని రెండు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా.. కరోనా విస్తరిస్తుండటంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో వాటర్ గ్రిడ్ పనులను వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .దీని కోసం వెంటనే టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైద్యపరంగా మౌలిక సదుపాయాలను పెంచుకునే ప్రక్రియలో భాగంగా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వాటర్ గ్రిడ్ పనుల్లో మొదటి విడతలో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాలో చేపట్టాల్సిన పనులపై ఫోకస్ పెట్టాలన్నారు.

ఇటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ కుటుంబంలో కరోనా సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇప్పటికే జరిగిన మొదటి, రెండు కుటుంబాల సర్వేపై సీఎం ఆరా తీశారు. ఇక రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టాలని.. ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, చర్యలు తీసుకోవాలన్నారు.రైతులు బహిరంగ మార్కెట్లో తమ వ్యవసాయోత్పత్తులను.. అమ్ముకోవాలని అనుకుంటే వారికి పూర్తిగా సహకరించేలా రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.ఇప్పటికే మొదటి, రెండు దశల కుటుంబ సర్వే పూర్తి చేశారని.. మిగిలిన అన్ని కుటుంబాల్లోను కరోనా సర్వే పూర్తి చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories