వారి కోసం విమానాలు ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి ఏపీ సీఎం లేఖ

వారి కోసం విమానాలు ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి ఏపీ సీఎం లేఖ
x
YS Jagan (File Photo)
Highlights

కువైట్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి చెందిన వలస కార్మికులు స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన మేరకు విమానాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్...

కువైట్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి చెందిన వలస కార్మికులు స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన మేరకు విమానాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు జగన్‌ లేఖ రాశారు. విశాఖ, విజయవాడ, తిరుపతికి వలస కార్మికుల కోసం విమానాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను వెనక్కి రప్పించేందుకు 'వందేభారత్‌' మిషన్‌ పేరుతో చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. వేలాది మంది భారతీయులు సద్వినియోగం చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు.

కరోనా వైరస్ తొ గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి,ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు స్వదేశానికి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారనీ.. వారంతా ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని లేఖలో సైన్ వివరించారు. కువైట్‌లో కనీస వసతులు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కువైట్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులును వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వీరి ప్రయాణ ఖర్చులు భరించేందుకు కువైట్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసిందనీ.. ఈ నేపథ్యంలో వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం జగన్ వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories