నరసరావుపేటలో గోపూజా కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్

X
Highlights
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేట రానున్నారు.
K V D Varma15 Jan 2021 1:40 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేట రానున్నారు. ఇక్కడ మునిసిపల్ స్టేడియంలో జరిగే గోపూజా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కనుమ పండగను పురస్కరించుకుని గోపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నరసరావుపేటలో లాంచనంగా ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నరసరావుపేట పర్యటన ఇలా..
- ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సిఎం బయలుదేరతారు.
- ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు.
- అక్కడి మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు.
- అనంతరం గోపూజలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.
Web TitleAndhra Pradesh Chief Minister to visit Narasarao Peta Guntur District for performing Gopuja Today
Next Story