
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.
ఎలూరు జిల్లా నుజివీడు టౌన్ & మండలంలో R.S.No.1065/1B లో 0.60 ఎకరాలు, R.S.No.1065/2B లో 9.36 ఎకరాలు కలుపుకుని మొత్తం 9.96 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (IIPM) స్థాపన కోసం హార్టికల్చర్ & సెరికల్చర్ విభాగ డైరెక్టర్ కు 33 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. లీజు అద్దె రూ. 13,70,000 సంవత్సరానికి చెల్లించాలి. అయితే, ప్రతి 5 సంవత్సరాల వ్యవధిలో ప్రస్తుత లీజు అద్దెపై 10% వరకు పెంచవచ్చు. లేదా BSO-24 నిబంధనల ప్రకారం ఉచితంగా, G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్మెంట్-I) శాఖ, తే.14.9.2012, ఇతర సాధారణ నిబంధనల ప్రకారం కేటాయించవచ్చు.
Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామం & మండలంలో సర్వే నెం.972 (పాత R.S.No.971)లో 9.88 ఎకరాల లీజును మూడు (3) సంవత్సరాల కాలానికి పునరుద్ధరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని వేదాంత లిమిటెడ్ (I&I ద్వారా)కు ఆన్షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు. లీజు అద్దె మార్కెట్ విలువపై 10% చొప్పున ఏడాదికి రూ.15,00,000/- (మొత్తం భూమి విలువ 9.88 ఎకరాలకు రూ.14,82,000) చెల్లించాలి. ఇది G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్మెంట్-I) శాఖ, తే.14.09.2012 లోని 3(h)(d) నిబంధనల ప్రకారం ఉంటుంది.
తిరుపతి జిల్లా దామినేడు గ్రామం సర్వే నెం.193-8, 193-9 మొదలైన వాటిలో మొత్తం 28.37 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి స్థానంలో SAAP కు "స్పోర్ట్స్ సిటీ" స్థాపన కోసం ఉచితంగా ఆ భూమిని బదిలీ చేసేందుకు తే.12.12.2025న రెవెన్యూ (భూములు-VIII) శాఖ ద్వారా జారీ చేసిన G.O.Ms.No.490 ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ముందుగా తే.28.11.2025న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కౌన్సిల్ రిజల్యూషన్ నెం.571/2025 ద్వారా ఈ భూమిని AP టూరిజం అథారిటీ (APTA)కి నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థాపనకు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. తరువాత యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ అభ్యర్థన మేరకు APTA స్థానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP)కు "స్పోర్ట్స్ సిటీ" స్థాపన కోసం బదిలీ చేయాలని నిర్ణయించారు. తత్కాలిక అవసరం దృష్ట్యా తే.12.12.2025న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. BSO-24 మరియు G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్మెంట్-I) శాఖ, తే.14.9.2012 నిబంధనలు, సాధారణ షరతులకు లోబడి ఉచితంగా బదిలీ చేయబడుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




