ఉద్యోగులకు పూర్తి వేతనం ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఉద్యోగులకు పూర్తి వేతనం ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
x
Highlights

రాష్ట్ర ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల...

రాష్ట్ర ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి వారికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించనుంది. ఈ మేరకు ఫైనాన్స్‌, ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అందుకు అనుగుణంగా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories