
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్నారు. సెక్రటేరియట్ను విశాఖపట్నానికి మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి జెఎసి నిర్వహించిన నిరసనలకు ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి మద్దతు ఇస్తున్నాయి. ఆందోళనలో భాగంగా శుక్రవారం జెఎసి బైక్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో టీడీపీ, సిపిఐ, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా నారా లోకేష్, సిపిఐ నారాయణ మరియు ఇతర నాయకులు బైక్లు నడిపారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జనవరి 20 న అమరావతి జెఎసి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. చలో అసెంబ్లీకి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని రైతులు, మహిళలను కోరారు. టీడీపీ ఇప్పటికే దీనికి జై కొట్టింది. జనసేన, బీజేపీ పార్టీలు తమ మద్దతు తెలియజేయాలని నిర్ణయించాయి. మూడు రాజధానులపై హై పవర్ కమిటీ సిఫారసులపై చర్చించడానికి జనవరి 20 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కానుంది.
మరోవైపు, హై పవర్ కమిటీ శుక్రవారం జగన్తో సమావేశమై తుది సమావేశం నిర్వహించింది. సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో రాజధానిపై ఏపీ క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 న అసెంబ్లీ సమావేశాలకు ముందు చలో అసెంబ్లీ పిలుపుతో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన కారులెవ్వరూ కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అంతేకాదు అక్కడ 144 సెక్షన్ విధించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



