చంద్రబాబు ఇసుక దీక్షపై వైసీపీ నేత అంబటి కౌంటర్

చంద్రబాబు ఇసుక దీక్షపై వైసీపీ నేత అంబటి కౌంటర్
x
Highlights

చంద్రబాబు ఇసుక దీక్షపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. ఇసుక నుండి రాజకీయ తైలం తీయాలనుకుంటున్నారని మండిపడ్డారు. దీక్షల పేరుతో మళ్లీ డ్రామాలు...

చంద్రబాబు ఇసుక దీక్షపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. ఇసుక నుండి రాజకీయ తైలం తీయాలనుకుంటున్నారని మండిపడ్డారు. దీక్షల పేరుతో మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారన్న ఆయన అధికారం లేకపోయేసరికి వికృత రూపాన్ని చూపిస్తున్నారని ఎద్దెవా చేశారు. తండ్రీ కొడుకులు శవరాజకీయాలు చేస్తున్నారన్న అంబటి టీడీపీ హయాంలో చనిపోయిన వారికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ గురించి మాట్లాడే నైతిక విలువలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేవని అంబటి రాంబాబు అన్నారు. తమపై పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని, విజయసాయిరెడ్డి సూట్ కేసు కంపెనీలు అంటూ పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు అంబటి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories