ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల
x
Highlights

ఏపీ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేష్‌ విడుదలైంది. రేపు శాసనసభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు నోటిఫికేషన్‌ విడుదల చేశారు....

ఏపీ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేష్‌ విడుదలైంది. రేపు శాసనసభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఉంది. ఈ నామినేషన్‌లను శాసనసభ కార్యదర్శి వద్ద దాఖలు చేయాల్సి ఉంది. కాగా స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తమ్మినేని సీతారాం ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories