వైసీపీలోకి మాజీ ఎంపీ హర్షకుమార్

వైసీపీలోకి మాజీ ఎంపీ హర్షకుమార్
x
Highlights

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆయన, ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు. జగన్ వారికి...

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆయన, ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరి కేవలం నాలుగేరోజులున్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

రాజీనామా చేసే సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీల మధ్య రాజకీయ ఒప్పందం ఉందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు పవన్ వింటున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories