Air India Flight: పొగమంచు ఎఫెక్ట్.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం

దట్టమైన పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ ఆలస్యం. ఏటీసీ క్లియరెన్స్ లేక ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Jan 2026 11:29 AM IST
Air India Flight Circles Mid-Air Due to Dense Fog at Vijayawada Airport
X

Air India Flight Circles Mid-Air Due to Dense Fog at Vijayawada Airport

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించింది. ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ అందలేదు. దీంతో భద్రత దృష్ట్యా పైలట్లు విమానాన్ని గాల్లోనే ఉంచి పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉన్నారు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు మారిన తర్వాతే విమానానికి ల్యాండింగ్ అనుమతి లభించింది. అధికారులు ఇది పూర్తిగా భద్రతా కారణాల వల్ల తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story