జగన్ మంత్రులకి, చంద్రబాబుకి మధ్య పోటి పెట్టిన అచ్చెన్నాయుడు...

జగన్ మంత్రులకి, చంద్రబాబుకి మధ్య పోటి పెట్టిన అచ్చెన్నాయుడు...
x
Highlights

మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏపీ మంత్రులకి సవాల్ విసిరారు.. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏపీ మంత్రులకి సవాల్ విసిరారు.. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా చంద్రబాబు ముసలివారు అయిపోయారంటూ ఎద్దేవా చేశారు. అయితే దీనిపైన అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "ఎవరు ముసలి వాళ్ళో, ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాం. బొత్స సత్యనారాయణ లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా సరే చంద్రబాబు కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి? ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు మిగిలిన వారు ముసలోళ్ళు" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ పోటీకి బొత్సగారూ సిద్ధమేనా ! పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికా సమావేశంలో ఒప్పుకోండి ! అంటూ ఛాలెంజ్ చేశారు. మరి దీనిపైన బొత్స, అధికార పార్టీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories