బస్సు లారీ, ఢీ: 20మందికి గాయాలు

బస్సు లారీ, ఢీ: 20మందికి గాయాలు
x
Highlights

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బొండపల్లి...

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బొండపల్లి మండలం నెల్లివాడ వంతెనపై ఘటన జరగింది. ప్రమాదంలో బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సును నెల్లివాడ వంతెనపై ఎదురుగా ఒడిశా నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అదే మార్గంలో బైక్ పై పయనిస్తున్న వ్యక్తి లారీని ఢీకొని గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories