Vijayawada: మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం

Vijayawada: మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం మత్తులో అత్యాచారం

Jyothi
Published on: 20 Dec 2022 10:46 AM IST
A Woman Was Raped by Four Men In Vijayawada
X

Vijayawada: మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం

Vijayawada: కృష్ణాజిల్లా పెనమలూరులో దారుణం చోటు చేసుకుంది. కూలి పని ఇప్పిస్తానని ఓ మహిళను తీసుకెళ్లిన వ్యక్తి.. ఆమెను గదిలో నిర్బంధించి, తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 17న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు కలిసి మహిళకు మద్యం త్రాగించి.. సిగిరెట్లతో వొళ్ళంతా కాల్చినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story