ఒక దొంగను పట్టుకునేందుకు వెయ్యి మంది..

ఒక దొంగను పట్టుకునేందుకు వెయ్యి మంది..
x
Highlights

ఒక దొంగను పట్టుకునేందుకు దాదాపుగా వెయ్యి మంది రంగలోకి దిగారు.. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి...

ఒక దొంగను పట్టుకునేందుకు దాదాపుగా వెయ్యి మంది రంగలోకి దిగారు.. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రామలక్ష్మమ్మ అనే మహిళ వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్యాంకు నుండి 16 లక్షల రూపాయలను డ్రా చేసింది. వాటిని తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్తుండగా కుళ్లాయప్ప అనే దొంగ ఆమెను బెదిరించి రామలక్ష్మమ్మ దగ్గర ఉన్న బ్యాగ్ ను లాక్కొని వెళ్ళాడు.

వెంటనే ఆమె పోలీసులకి సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. అంతేకాకుండా పక్కన ఉన్న గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. దీనితో దాదాపుగా వేయి మంది రంగంలోకి దిగి కొన్ని గంటలలోనే దొంగను పట్టుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ది చేసి పోలీసులకి అప్పగించారు. అనంతరం పోలీసులు అతడి వద్దనుంచి డబ్బును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఆ డబ్బు రెండు గ్రామాలకు సంబంధించిన వృధ్యాప్య ఫించన్ గా తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories