గుడి ముందు అడుక్కొని మళ్ళీ అదే గుడికి 8 లక్షల విరాళం

గుడి ముందు అడుక్కొని మళ్ళీ అదే గుడికి 8 లక్షల విరాళం
x
Highlights

పుణ్యక్షేత్రాలు ముందు అడుక్కొనే వారిని మనం చాలా మందిని చూసుంటాం.. అలా వచ్చిన డబ్బులతో తమకి తామను నమ్ముకున్న వారి ఆకలిని తీరుస్తారు.

పుణ్యక్షేత్రాలు ముందు అడుక్కొనే వారిని మనం చాలా మందిని చూసుంటాం.. అలా వచ్చిన డబ్బులతో తమకి తామను నమ్ముకున్న వారి ఆకలిని తీరుస్తారు. కానీ ఓ భిక్షగాడు మాత్రం ఏ గుడి దగ్గర అయితే తానూ భిక్షాటన చేసాడో అదే గుడికి ఏకాంగా ఎనమిది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

విజయవాడ ముత్యాలంపాడులోని షిర్డీ సాయిబాబు గుడి ముందు యాదిరెడ్డి అనే బిక్షగాడు భిక్షాటన చేసేవాడు. అలా వచ్చిన డబ్బులను పోగు చేసేవాడు.. అలా పోగు చేసిన డబ్బులను మళ్ళీ అదే గుడికి విరాళంగా ఇచ్చాడు. అల ఆ ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. నిజానికి 75 ఏళ్ళు ఉన్న యాదిరెడ్డి ఒకప్పుడు రిక్షా తొక్కేవాడు. కానీ వయసు మీదా పడడంతో రిక్షా తొక్కడం ఆపేశాడు.


ఆ తర్వాత విజయవాడలోని పలు ఆలయాల ముందు భిక్షాటన చేస్తూ డబ్బును పోగు చేస్తూ మళ్ళీ అదే ఆలయాలకు ఆ డబ్బును విరాళంగా ఇచ్చాడు. ఇలా ఆలయానికి విరాళంగా ఇచ్చినప్పుడు భక్తులలో నాపై గౌరవం పెరిగిందని యాదిరెడ్డి చెప్పుకొచ్చాడు. యాదిరెడ్డి కేవలం ఈ ఒక్క ఆలయానికి మాత్రమే కాదు ఇంకా చాలా ఆలయాలకి విరాళాలు ఇచ్చాడు. తన జీవితాంతం దేవుడి సన్నిధిలోనే గడిపెస్తానని యాదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories