ఏలూరులో 572కు చేరిన బాధితుల సంఖ్య

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఆరు కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది.

admin
Published on: 9 Dec 2020 9:11 AM IST
ఏలూరులో 572కు చేరిన బాధితుల సంఖ్య
X

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఆరు కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది. ఇప్పటివరకు 500 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. మరో 72 మంది చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు 29 మందిని తరలించారు. ఇప్పటికే ఏలూరు చేరుకున్న ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్ల బృందం.. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించింది.

admin

admin

Next Story