ఏపీలో క్రమంగా తగ్గుతోన్న డెత్ రేట్‌

ఏపీలో క్రమంగా తగ్గుతోన్న డెత్ రేట్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 85వేల 364 శాంపిల్స్‌ను పరీక్షించగా.... 2745మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 85వేల 364 శాంపిల్స్‌ను పరీక్షించగా.... 2745మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే, గత 24గంటల్లో 13మంది మృత్యువాత పడటంతో.... మొత్తం మృతుల సంఖ్య 6757కి చేరింది. అయితే, కరోనా పేషెంట్ల రికవరీ రేటు భారీగా పెరగడంతో.... ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21వేల 878కి తగ్గింది.

కరోనా రోగుల డెత్‌ రేట్ తగ్గుతుండటంతో రోజురోజుకీ మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. గత 24గంటల్లో 13మంది మృత్యువాత పడటంతో.... మొత్తం మృతుల సంఖ్య 6757కి చేరింది. ఈరోజు కృష్ణాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు మరణించగా... అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

ఏపీలో కరోనా రికవరీ కేసులు 8లక్షల 7వేలు దాటాయి. రికవరీ రేటు పెరగడంతో ఇప్పటివరకు 8లక్షల 7వేల 318మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఇక, కరోనా పరీక్షలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటివరకు 84లక్షల 27వేల 629మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 8లక్షల 35వేల 953మందికి వైరస్ సోకగా.... ఇప్పటికే 8లక్షల 7వేల 318మంది కరోనా రోగులు కోలుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories