పశ్చిమగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం...

పశ్చిమగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం...
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల వద్ద లారీ-మారుతీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల వద్ద లారీ-మారుతీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 11 మందిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెందుర్తి నుంచి ఏలూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు విశాఖ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories