ఆ బోట్లన్నీ వారికే రాసిస్తా : మంత్రి అవంతి సవాల్

ఆ బోట్లన్నీ వారికే రాసిస్తా : మంత్రి అవంతి సవాల్
x
Highlights

ఆ బోట్లన్నీ వారికే రాసిస్తా : మంత్రి అవంతి సవాల్ ఆ బోట్లన్నీ వారికే రాసిస్తా : మంత్రి అవంతి సవాల్

నాకు సొంత బోట్లు ఉన్నట్లు నిరూపిస్తే.. వారికే రాసిస్తానని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. బోటును ఉద్దేశ్యపూర్వకంగానే వెలికితీయడం లేదని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను అవంతి ఖండించారు.. ప్రస్తుతం రాయల్ వసిష్ఠ బోటు వెలికితీతకోసం మానవ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బోటు వెలికితీతను రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్‌. తనకు పర్యాటక బోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ తనకు సొంత బోట్లు ఉన్నట్లు నిరూపిస్తే.. వారికే వాటన్నింటిని రాసిస్తానన్నారు మంత్రి అవంతి. మరోవైపు బోటు వెలికితీత విషయంలో హర్షకుమార్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ధర్మాడీ సత్యం బృందం బోటును వెలికితీసే ప్రయత్నాలు చేసి విఫలమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories