మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం
x
Highlights

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌.. ఐఏఎస్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు దగ్గర పీఎంవో కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. యుగంధర్‌ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. బీఎన్‌ యుగంధర్‌ మృతి పట్ల ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories