భార్య చేతులను నరికిన భర్త

భార్య చేతులను నరికిన భర్త
x
Highlights

ఒకరికి ఒకరంటూ జీవితాంతం నమ్మకంతో కలిసుండాల్సిన భార్యా భర్తలు తరుచూ గొడవలు పడుతూ వారి నిండు జీవితాలను పాడుచేసుకుంటున్నారు.

ఒకరికి ఒకరంటూ జీవితాంతం నమ్మకంతో కలిసుండాల్సిన భార్యా భర్తలు తరచూ గొడవలు పడుతూ వారి నిండు జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇదే తరహాలో భార్య పైన అనుమానంతో భర్త తనపై కిరాతకంగా దాడి చేసి రెండు చేతులు నరికేసాడు. ఈ సంఘటన రైల్వేకోడూరు మండల పరిధిలోని దేశెట్టిపల్లె లక్ష్మీగార్జెన్స్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకెలితే చౌడవరం శివయ్య, పద్మావతికి ఐదేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. వాలిద్దరు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కొన్ని నెలలుగా వారిదరి మధ్య తరచూ గొడలు జరుగుతున్నాయి. దీంతో భార్య పద్మావతి(35) కొన్ని రోజుల కిందట పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో పెద్ద మనుషులు ఇదరి మధ్య చర్చలు జరిపి ఆమెని భర్త ఇంటికి తీసుకొచ్చారు . భార్యపైన అనుమానం పెంచుకున్న భర్త శివయ్య ఆమె ఇంటికి వచ్చిన రోజు సాయంత్రం నుంచే మళ్ళి గొడవ పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయింది. దీంతో పద్మావతి తిరిగి పుట్టింటికి వెళ్లిపోతున్న సమయంలో కత్తి పట్టుకుని ఆమెని అడ్డగించి, కోపంలో ఆమె రెండు చేతులను నరికాడు.

ఈ ఘటనలో పద్మావతి కుడి చేయి పూర్తిగా తెగి పడిపోయింది. ఎడమ చేయి కొద్దిగా అతుక్కుని ఉంది. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే కోడూరు పట్టణ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యులు రెండో చేయి అతుకుతుందా లేదా అనే విషయాన్ని ఇంకా నిర్ధరించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories