చెత్త నుంచి సంపద సృష్టి

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు శానిటేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
తుని: పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు శానిటేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయాన్నే వార్డుల్లో పర్యటించి చెత్తను సేకరించే పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో వార్డుల్లో నే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వార్డుల్లో సేకరించిన చెత్తను తడి చెత్త, పొడి చెత్త ను అక్కడే వేరు చేసి తోపుడు రిక్షా లో ఏర్పాటుచేసిన వేరు వేరు డస్ట్ బిన్ లో వేస్తున్నారు.
చెత్తను సేకరించి ట్రాక్టర్లో తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్ లో వేయడం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు మున్సిపాలిటీలు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసే రైతులకు అందజేస్తున్నారు. పొడి చెత్తను కూడా వాటిని ఉపయోగించుకునే కర్మాగారాలకు విక్రయిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పట్టణంలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ఆన్ సైట్ కంపోస్టింగ్ ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసి వాటిని వినియోగంలోకి తీసుకువస్తున్నారు. తుని మున్సిపాలిటీ లో పైలెట్ ప్రాజెక్ట్ గా బ్యాంక్ కాలనీ ఎంపిక చేస్తామని, మున్సిపాలిటీలో అన్ని వాటిల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు వెల్లడించారు.
లైవ్ టీవి
మహేష్, బన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి జక్కన్న హీరోలు?
10 Dec 2019 4:46 PM GMTరోహిత్ క్లీన్షేవ్ ఆమె కోసమేనట..!
10 Dec 2019 4:32 PM GMTమహేష్ అబ్బురపరిచే ఫీట్.. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు
10 Dec 2019 4:00 PM GMTఅతని ఓపిక చూసి ప్రేరణ పొందుతున్నాం
10 Dec 2019 3:51 PM GMTరేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
10 Dec 2019 3:22 PM GMT