బ్లాక్లో టికెట్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా చేస్తాం : వైవీ సుబ్బారెడ్డి
తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపుతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో నిర్మించిన పద్మావతి కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటికే ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను తొలగించామన్న వైవీ సుబ్బారెడ్డి బ్లాక్లో టికెట్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా చేస్తామన్నారు. పదివేల రూపాయలపైన విరాళాలు ఇచ్చేవారికి వీఐపీ దర్శనం ఎలా ఇవ్వాలనేదానిపై బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.