హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్స్టేషన్ వద్ద లోకేశ్వరి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే స్పందించిన కానిస్టేబుళ్లు మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకేశ్వరి మృతి చెందింది.