తెలంగాణా లో అసలు పాలనే సక్రమంగా లేదని కాంగ్రెస్ పార్టీ మహిళానేత విజయశాంతి అన్నారు. కోనేరు కృష్ణ దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితను ఫోన్లో పరామర్శించిన వియనశాంతి ఫేస్ బుక్ లో ఈ సంఘటనపై స్పందించారు. తెలంగాణాలో ఆటవిక పాలన నడుస్తోందని ఆమె పేర్కొన్నారు.
"రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుంది.. మహిళ ఉన్నతాధికారులకు రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు పాలన ఉందా? ముఖ్యమంత్రి ఆడంబరాలకు పరిమితం అయ్యారు. రాష్ట్రంలో దొంగలు రాజ్యమేలు తున్నారు" అని విమర్శలు గుప్పించారు.