హుజుర్నగర్ ఉపఎన్నికల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి అధికార దుర్వినియోగం, అహంకారం పతాక స్థాయికి చేరిందన్నారు. 30వేల మెజారిటీతో హుజుర్నగర్లో గెలవబోతున్నామన్నారు. సూర్యాపేట జిల్లా నెరేడుచెర్లలో హుజుర్నగర్ ఉపఎన్నికల ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా పలువురు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరారు. వారిని ఉత్తమ్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.