చట్టబద్దంగానే బీజేపీలో టీడీపీ ఎంపీల విలీనం: కిషన్ రెడ్డి

Update: 2019-06-23 13:52 GMT

టీడీపీ రాజ్యసభ సభ్యులు చట్టబద్దంగానే బీజేపీలో వీలీనమయ్యారన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గతంలోనూ రాజ్యసభలో ఇలాంటి విలీనాలు 16 సార్లు జరిగాయన్నారు. రాజ్యసభ చైర్మన్ కి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన లేఖ ప్రకారం ప్రక్రియ జరిగిందన్నారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే విలీనం జరిగిందని, అన్ని నిబంధనలు చూసిన తర్వాతే రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు.  

Tags:    

Similar News